సుధీర్ బాబు పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ పాత్రలో నటిస్తున్నాడు. పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తై విడుదలకు సిద్ధమైంది. ఆగస్ట్ 27న ఈ సినిమా విడుదల కానుంది.
ఇక ఈ చిత్రంలో సుధీర్ బాబు చాలానే పెద్ద రిస్క్ చేసాడట. శ్రీదేవి సోడా సెంటర్ కోసం బోట్ డ్రైవింగ్ నేర్చుకున్న సుధీర్ బాబు 15 రోజుల పాటు 84 బోట్లతో షూట్ చేసిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నటించాడట. గోదావరి మధ్యలో ఎటువంటి డూప్ లేకుండా సుధీర్ చేసిన ఈ రిస్కీ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ బోట్ రేస్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చిందట.
70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన తొలిపాట సూపర్ హిట్ గా నిలిచింది.