దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రెండు సినిమాల పై రివ్యూ ఇచ్చేసాడు . ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏవయ్యా అంటే ఒకటేమో మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన ”సమ్మోహనం” గురించి మరొకటి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ” ఈ నగరానికి ఏమైంది ” చిత్రం గురించి . సమ్మోహనం చిత్రం జూన్ 15న విడుదల కాగా ఈ నగరానికి ఏమైంది చిత్రం మాత్రం ఈరోజు విడుదల అయ్యింది . సమ్మోహనం చిత్రం చూద్దామని ముందే అనుకున్నాడట అయితే రకరకాల పనుల వల్ల వీలుకాలేదని మొత్తానికి సమ్మోహనం చూశానని సుధీర్ బాబు – అదితిరావ్ హైదరి ల నటన అద్భుతమని కొనియాడాడు . అంతేకాదు సీనియర్ నటుడు నరేష్ పై కూడా ప్రశంసలు కురిపించాడు జక్కన్న . విభిన్న కథా చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ సమ్మోహనం చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే .
ఇక ఈరోజు విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ నగరానికి ఏమైంది చిత్రం పై కూడా ప్రశంసలు కురిపించాడు జక్కన్న . మంచి కామెడీ ఉంది అంటూ చిత్ర బృందానికి అభినందనలు అందించాడు . పెళ్లి చూపులు చిత్రంతో తెలుగునాట ప్రభంజనం సృష్టించాడు దాస్యం తరుణ్ భాస్కర్ . దాంతో అతడి రెండో సినిమా అందునా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం కావడంతో ఈ నగరానికి ఏమైంది చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి . హిట్ టాక్ అయితే వచ్చింది ఈ నగరానికి ఏమైంది చిత్రానికి అయితే ఇది మల్టీప్లెక్స్ చిత్రం మాత్రమే అని అంటున్నారు అప్పుడే . చూడాలి మరి మెస్మరైజ్ చేస్తుందా ? లేదా ? అన్నది .
English Title: SS Rajamouli review on Ee Nagaraniki Emaindi and Sammohanam
Watched #Sammohanam little late… Quite impressed with @aditiraohydari‘s performance. @isudheerbabu is good too. @ItsActorNaresh garu is hilarious. Belated Congratulations to the team… ?
— rajamouli ss (@ssrajamouli) June 29, 2018
Tharun Bhascker does it again.
A ‘Sukoon’ film with lots of laughter. Hearty Congrstulations to team #EeNagaranikiEmaindi…— rajamouli ss (@ssrajamouli) June 29, 2018