Homeగాసిప్స్మెగాస్టార్ ను కలిసిన ప్లాప్ డైరెక్టర్.. కారణమేంటి?

మెగాస్టార్ ను కలిసిన ప్లాప్ డైరెక్టర్.. కారణమేంటి?

మెగాస్టార్ ను కలిసిన ప్లాప్ డైరెక్టర్.. కారణమేంటి?
మెగాస్టార్ ను కలిసిన ప్లాప్ డైరెక్టర్.. కారణమేంటి?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ షూటింగ్ లో బిజీగా ఉంటోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని 100 వర్కింగ్ డేస్ కు మించకుండా షూటింగ్ పూర్తి చేయాలన్న నిబంధనతో ఫాస్ట్ పేస్ తో కానిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రకు మహేష్ బాబును అప్రోచ్ అవ్వడం, సూపర్ స్టార్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం తెల్సిందే. ఇక షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా చిరంజీవి ఇతరులను కలవడానికి అందుబాటులో ఉంటున్నాడు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర పోషిస్తోన్న చిరంజీవి ఎవరు వచ్చినా కూడా వారి సమస్యలు వింటున్నాడు, అలాగే తోచిన సహాయం చేస్తున్నాడు. షూటింగ్ స్పాట్ లో బ్రేక్స్ సమయంలో ఎవరో ఒకరితో సమయం గడుపుతోన్న చిరు, రీసెంట్ గా దర్శకుడు శ్రీను వైట్లను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చిరంజీవి, శ్రీను వైట్ల కలిసి అందరివాడు చేసారు. ఆ సినిమా ఓ మోస్తరు ఫలితాన్ని ఇచ్చింది. అయితే అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు శ్రీను వైట్ల పూర్తిగా డౌన్ అయిపోయాడు. తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్లంప్ ను ఎదుర్కొంటున్నాడు. చేసిన సినిమాలు చేసినట్లే ప్లాప్ అవుతుండడంతో శ్రీను వైట్ల చేతిలో ఇప్పుడు సినిమాలు లేవు. ఈ సమయంలో చిరంజీవిని కలవడానికి కారణమేమై ఉంటుందా అని ఆసక్తికర చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది.

- Advertisement -

స్నేహపూర్వకంగానే చిరంజీవిని కలిసాడని, ఐతే కలిసినప్పుడు సినిమాల టాపిక్ వచ్చిందని, ఎక్కువగా దిగులు చెందకు, మంచి కథతో వస్తే సినిమా తప్పకుండా చేద్దామన్నట్లుగా చిరంజీవి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ నిజంగానే శ్రీను వైట్లకు మునుపటి రేంజ్ స్క్రిప్ట్ సెట్ అయితే తన కామెడీ టైమింగ్ కు చిరంజీవి యాక్టింగ్ తో ఫ్యాన్స్ కు పండగ అనడంలో సందేహం లేదు. అయితే శ్రీను వైట్ల చిరంజీవిని ఒప్పించే స్క్రిప్ట్ ను పట్టగలడా అన్నది ఇప్పుడు ప్రశ్నర్ధకంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All