Homeటాప్ స్టోరీస్నా జోలికొస్తే పంబ పగిలిపోద్ది : చిరుకి శ్రీరెడ్డి వార్నింగ్

నా జోలికొస్తే పంబ పగిలిపోద్ది : చిరుకి శ్రీరెడ్డి వార్నింగ్

sri reddy targets chiranjeevi uses foul language
sri reddy targets chiranjeevi uses foul language

కొంతమంది అంతే.. వాళ్ళని కెలికితే అంతకంతకూ దిగజారిపోతుంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాకుండా ఎడాపెడా విమర్శలు చేసి పారేస్తుంటారు. పబ్లిసిటీ వస్తుందంటే ఎంత దిగజారుడు వ్యాఖ్యలైనా చేయడానికి రెడీ అయిపోతారు. పెద్ద వ్యక్తా, చిన్న వ్యక్తా అన్నది కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ తమ పబ్బం గడుపుకుంటారు. ఈ పాటికే మీకు అర్ధమై ఉంటుంది కదా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. అవును వివాదాల పుట్ట శ్రీ రెడ్డి గురించే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే ముందు నుండీ ఎందుకో శ్రీ రెడ్డికి అస్సలు పడదు. ఇప్పటికే ఎన్నోసారి హద్దులు మీరు మరీ పవన్ ను విమర్శిస్తూ వస్తోంది శ్రీ రెడ్డి. పవన్ ను అన్ని మాటలంటున్నా ఏనాడూ చిరంజీవిని పర్సనల్ గా టార్గెట్ చేసింది లేదు. అయితే ఇప్పుడిక అది కూడా అయింది. సోషల్ మీడియా సాక్షిగా చిరంజీవిని దుమ్మెత్తిపోసింది శ్రీ రెడ్డి.

నా జోలికొస్తే పంబ పగిలి రంభ బయటకొస్తాది!, మీకు పేరుంది కాబట్టి మేమంతా ఎదవలమా, వయసు కాదు జ్ఞానం రావాలి, సారీ చిరంజీవి గారు మీ నా కామెంట్స్ కూడా పట్టించుకోవాలి. నేను మీలో మంచి, చెడు రెండిటి గురించి మాట్లాడతా, ఎంతో మంది టాలెంటెడ్ హీరోస్ ను తొక్కి, తొక్కలో 13 హీరోస్ ని కన్నారు.. నన్ను కూడా తొక్కుతారా, వినాశకాలే విపరీత బుద్ధి అని నన్ను కెలకొద్దు అంటూ చాలా ఘాటుగా విమర్శలు చేసింది శ్రీ రెడ్డి. అక్కడితో ఆగిపోతే ఆమె శ్రీ రెడ్డి ఎందుకవుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి పెట్టిన డబ్బులు, కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసినప్పుడు చిరంజీవికి ముట్టిన డబ్బులుగా శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది. అప్పటికి కూడా ఆమె అక్కసు తీరలేదు. చిరంజీవి వయసుపై కూడా ఆమె కామెంట్స్ విసిరింది. ముని మనవళ్ల తాతయ్య హీరో చిరంజీవి కొత్త సినిమా కొరటాలతో అంటూ పోస్ట్ చేసింది.

- Advertisement -

అసలు ఇంతకీ ఇప్పుడు సడెన్ గా చిరంజీవిని టార్గెట్ చేయాల్సిన అవసరం శ్రీ రెడ్డికి ఏం వచ్చిందంటే దానికి కారణం బిగ్ బాస్ గా చూపిస్తున్నారు విశ్లేషకులు. బిగ్ బాస్ ఫినాలే కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. అక్కడ తమన్నా సింహాద్రిని చూడగానే చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తప్పు జరిగితే బయటకు వచ్చి చెప్పగల ధైర్యవంతురాలివి. అప్పటివరకూ ఎవరితో ఉన్నా, వాళ్ళు తప్పు చేస్తే ఆ ఫ్రెండ్షిప్ ను కూడా కట్ చేసుకుని నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పే ధైర్యం నీకు ఉంది. ఇది నీకు నాకు అర్ధమైతే చాలు అని అన్నాడు. దానికి తమన్నా చాలా ఎమోషనల్ అయిపోయింది. అప్పుడే ఆ వ్యాఖ్యలన్నీ శ్రీ రెడ్డిని ఉద్దేశించినవే అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు శ్రీ రెడ్డి రియాక్షన్ బిగ్ బాస్ లో మాట్లాడిన దాని గురించే అని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All