వివాదాలతో నిత్యం సహవాసం చేస్తున్న భామ శ్రీరెడ్డి తాజాగా మంచు లక్ష్మి పై సెటైర్ వేసింది . ఇంతకీ మంచు లక్ష్మి చేసిన పనేంటి అంటే ……. 1992 క్లాసిక్ జంబలకిడి పంబ అని ట్వీట్ చేయడమే అయితే హీరో నరేష్ కు బదులుగా రాజేంద్రప్రసాద్ అద్భుతంగా నటించాడు అంటూ కామెంట్ చేయడమే ! ఇంకేముంది శ్రీ రెడ్డి కి కావాల్సినంత పని దొరికింది దాంతో ఇంగ్లీష్ పుత్రి అంటూ మంచు లక్ష్మి పై విరుచుకుపడింది .
జంబలకిడి పంబ ని రాజేంద్ర ప్రసాద్ ని అవమానించడమే అంటూ నీ ఇంగ్లీష్ తో మమ్మల్ని చంపకు అన్నట్లుగా సెటైర్ వేసింది శ్రీ రెడ్డి . మంచు లక్ష్మి ప్రసన్న అమెరికాలో ఉండి రావటం వల్ల తన భాషలో ఎక్కువగా స్టైలిష్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది దాంతో అమెరికాలో మాట్లాడితే ఓకే కానీ ఇక్కడ కాదు అంటూ సెటైర్ వేస్తోంది పాపం . శ్రీ రెడ్డి ప్రస్తుతం చెన్నై లో మకాం పెట్టింది . టాలీవుడ్ ని షేక్ చేసి చెన్నై కి మకాం మార్చింది .