బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తన చిన్ననాటి ప్రియురాలు నటాషా దలాల్తో అలీబాగ్లోని ది మాన్షన్ హౌస్లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలని వరుణ్ధావన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు అతనికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ నానితో కలిసి `జెర్సీ` చిత్రంలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం వరుణ్ధావన్ పెళ్లిపై విచిత్రంగా కామెంట్ చేసింది.
కొత్త జంటకు అంతా శుభాకాంక్షలు తెలుపుతుంటే నటి శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం వరుణ్ ధావన్ని అభినందిస్తూనే విచిత్రంగా కామెంట్ చేయడం నెట్టింట వైరల్గా మారింది. వరుణ్ మరియు నటాషా వివాహ ఫొటోని షేర్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ ఇలా వ్రాసింది`మరో మంచి నటుడు మట్టికరుస్తున్నాడు. మనం అతన్ని మళ్లీ తెరపై చూడలేకపోవడమనేది చాలా విచారకరం. స్పష్టంగా అతని భార్య, చట్టాలు అతనితో ఇతర హీరోయిన్లతో నటించడం అంగీకరించరు. బహుశా అతను మగ ఆధారిత సినిమాలు చేయడానికి మారతాడేమో?.. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని ఎలా సమన్వయం చేసుకుంటాడన్నది చాలా కఠినమైనది. అతన్ని కోల్పోతాం` అంటూనే అభినందనలు వరుణ్ అని ఇన్ స్టా వేదికగా కామెంట్ చేసింది.
శ్రద్ధా శ్రీనాథ్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తెలుగులో నాని హీరోగా నటించిన `జెర్సీ` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ సుందరి తొలి చిత్రంతో మంచి నటిగా ప్రశంసలు దక్కించుకుంది. అయితే తాజా పోస్ట్ని చూసిన వారంతా శ్రద్ధా శ్రీనాథ్ ఏంటీ ఇలా కామెంట్ చేస్తోందంటూ వాపోతున్నారట.