ఓ పొజిషన్ కి వచ్చాక హీరో, హీరోయిన్లు తమకి నచ్చిన వ్యాపారంలోకి అడుగు పెడుతుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఫిట్ నెస్ సెంటర్స్ ని రన్ చేస్తున్నారు. అలాగే గోవా బ్యూటీ ఇలియాన హైదరాబాద్లో బ్యూటీ పార్లర్, స్పా నెలకొల్పింది. ఇక్కడే ఒక మాల్లో ఒక ఆధునికి ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించింది. మరో నటి త్రిష హోటల్ బిజినెస్లో ప్రవేశిస్తున్నారు. నటి నమిత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. మద్రాస్, హైదరాబాద్లో ఈ వ్యాపారం చేస్తున్నారు. తమన్నా, స్నేహ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
సీనియర్ నటి శ్రియ ముంబాయిలో శ్రీ స్పా పేరుతో ఓ సెంటర్ నెలకొల్పారు. కన్నడ నటి భావన బెంగళూరులో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. వీరి జాబితాలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా చేరింది. ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది శ్రద్ధ. ఇందులో. నానికి ప్రియురాలిగా, భార్యగా మెచ్యూరిటి కలిగిన నటనతో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత ‘జోడి’ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పలు తెలుగు, తమిళ , కన్నడ చిత్రాల్లో బిజీగా ఉన్న ఆమె తాజాగా సలాడ్ బార్ అండ్ కేఫ్, పెర్సి ని చెన్నై లో ప్రారంభించారు.
ఇది రెస్టారెంట్ కంటే కాస్త చిన్నదిగా, కేఫ్ కంటే పెద్దదిగా ఉంటుందట. ఇక్కడ ఆరోగ్యకరమైన ఫుడ్ లభిస్తుందని, దీన్ని ఆదరించాలని శ్రద్ధ కోరుకుంది. సినిమాల్లో తనపై చూపిస్తున్న ప్రేమ తన వ్యాపారంపై కూడా చూపించాలంటోంది. ప్రస్తుతం శ్రద్ధ తెలుగులో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తోపాటు తమిళ్ లో రెండు సినిమాలు, కన్నడలో మరో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.