ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకడంతో ఇటీవల చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయనని గురువారం రాత్రి ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.
బాలు ఆరోగ్యం మెరుగుపడటంతో తాజాగా అమర్చిన ఆక్సిజన్ని తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా వున్నట్టు తెలిసింది.
సోదరుడు బాలు ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ప్రముఖ నేపథ్య గాయని ఎస్.పీ. శైలజ స్పందించారు. `అన్నయ్య ఆరోగ్యం రోజు రోజుకీ మెరుగవుతోంది. డాక్టర్ల ట్రీట్మెంట్కు ఆయన స్పందిస్తున్నారు. ఇది సంతోషించాల్సిన విషయం. ప్రస్తుతం అన్నయ్యకు అమర్చిన వెంటిలేటర్ని తొలగించారు. ఆయన కోలుకుంటున్న తీరు పట్ల డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు.
అన్నయ్య ఆరోగ్యంగా వుండాలని, త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆయన అభిమానలు ప్రార్థిస్తున్నారు. తప్పకుండా అన్నయ్య కోలుకుని తిరిగి వచ్చేస్తారు. ప్రార్థిస్తున్న అందరికి థ్యాంక్స్` అని ఎస్.పీ శైలజ ఓ వాయిస్ సందేశాన్ని పంపించారు.