Homeటాప్ స్టోరీస్ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా పాటిజివ్‌!

ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా పాటిజివ్‌!

SP Balasubhramanyam tetes Corona positive
SP Balasubhramanyam tetes Corona positive

క‌రోనా మ‌హ‌మ్మారి విళ‌య తాండ‌వం చేస్తోంది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు మ‌హారాష్ట్ర , త‌మిళనాడులో ప్ర‌మాద స్థాయికి చేరింది. ప‌దుల సంఖ్య‌ల్లో రాజ‌కీయ నాయ‌కులు, వంద‌లు, వేల సంఖ్య‌ల్లో సామాన్యులు వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఉత్త‌రాదిలో వైర‌స్ బారిన ప‌డుతున్న సినీ సెల‌బ్రిటీల సంఖ్య పెరుగుతూనే వుంది. ద‌క్ష‌ణాదిలో ఇటీవ‌లే సినీ సెల‌బ్రిటీలు వైర‌స్ బారిన ప‌డుఉన్నారు.

తాజాగా గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వైర‌స్ బారిన ప‌డిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. ఓ వీడియో ని షేర్ చేసిన ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం `గ‌త రెండు రోజులుగా జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్నాను. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం క‌రోనా సోకిన‌ట్టు నిర్థార‌ణ అయ్యింది. వైర‌స్ తీవ్ర‌త చాలా త‌క్కువ‌గా వుంది. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. ప్ర‌స్తుతం నా ఆరోగ్యం మెరుగ్గానే వుంది. మీ ఆశీస్సుల‌తో తొంద‌ర‌లోనే కోలుకుంటాను` అని ఆ వీడియోలో స్ప‌ష్టం చేశారు.

- Advertisement -

టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు బండ్ల గ‌ణేష్‌, స‌మంత స్నేహితురాలు, ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, తేజ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రాజ‌మౌళి, తేజ హోమ్ క్వారెంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. వీరు త్వ‌ర‌లోనే కోలుకుంటార‌ని అంతా ఆశా భావం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All