స్టార్ హీరో మహేష్ ఫ్యాన్స్, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్కు మధ్య వివాదాన్ని రేపిన చిత్రం `కప్పెల`. మలయాళంలో అన్నా బెన్, శ్రీనాథ్ భాసీ, రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రల్లో మహమ్మద్ ముస్తఫా తెరకెక్కించిన తొలి చిత్రమిది. ఈ చిత్రాన్ని చూసే దర్శకుడు తరుణ్ భాస్కర్ తన అభిప్రాయాన్ని, కమర్శియల్ ముసుగులో తెలుగు సినిమా వెళుతున్న గమనాన్ని విమర్శించారు.
ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. తెలుగులో పెను వివాదాన్ని రాజేసిన ఈ చిత్రం మార్చి 6న విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. కరోనా వైరస్ ప్రబలడంతో ఈ చిత్రాన్ని గత నెల జూన్ 22న నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రం త్వరలో తెలుగులో రీమేక్ కాబోతోంది. ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నారు.
దీన్ని ఎవరితో రీమేక్ చేస్తారు? ఎవరు నటిస్తారు? దర్శకుడు ఎవరు అనే విషయాలు తెలియాల్సి వుంది. ఈ చిత్రం కారణంగా వివాదంలో చిక్కుకున్న తరుణ్ భాస్కర్కే ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఛాన్స్ ఇస్తారా? లేక మరో దర్శకుడిని సితార ఎంటర్టైన్మెంట్స్ ఎంచుకుంటుందా? అన్నది చూడాల్సిందే.