Homeటాప్ స్టోరీస్తెలుగులో రీమేక్ అవుతున్న వివాదాస్ప‌ద చిత్రం!

తెలుగులో రీమేక్ అవుతున్న వివాదాస్ప‌ద చిత్రం!

తెలుగులో రీమేక్ అవుతున్న వివాదాస్ప‌ద చిత్రం!
తెలుగులో రీమేక్ అవుతున్న వివాదాస్ప‌ద చిత్రం!

స్టార్ హీరో మ‌హేష్ ఫ్యాన్స్‌, యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌కు మ‌ధ్య వివాదాన్ని రేపిన చిత్రం `క‌ప్పెల‌`. మ‌ల‌యాళంలో అన్నా బెన్‌, శ్రీ‌నాథ్ భాసీ, రోష‌న్ మ్యాథ్యూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో మ‌హ‌మ్మ‌ద్ ముస్త‌ఫా తెర‌కెక్కించిన తొలి చిత్రమిది. ఈ చిత్రాన్ని చూసే ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ త‌న అభిప్రాయాన్ని, క‌మ‌ర్శియ‌ల్ ముసుగులో తెలుగు సినిమా వెళుతున్న గ‌మ‌నాన్ని విమ‌ర్శించారు.

ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. తెలుగులో పెను వివాదాన్ని రాజేసిన ఈ చిత్రం మార్చి 6న విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధించింది. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో ఈ చిత్రాన్ని గ‌త నెల జూన్ 22న నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. ఈ చిత్రం త్వ‌ర‌లో తెలుగులో రీమేక్ కాబోతోంది. ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సొంతం  చేసుకున్నారు.  ‌

- Advertisement -

దీన్ని ఎవ‌రితో రీమేక్ చేస్తారు? ఎవ‌రు న‌టిస్తారు? ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనే విష‌యాలు తెలియాల్సి వుంది. ఈ చిత్రం కార‌ణంగా వివాదంలో చిక్కుకున్న త‌రుణ్ భాస్క‌ర్‌కే ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఛాన్స్ ఇస్తారా?  లేక మ‌రో ద‌ర్శకుడిని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఎంచుకుంటుందా? అన్న‌ది చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All