Homeటాప్ స్టోరీస్బీజేపీ పతనం ప్రారంభం అక్కడి నుండే

బీజేపీ పతనం ప్రారంభం అక్కడి నుండే

shocking survey for bharatiya janata partyరాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్ లలో జరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని ఏబీపీ న్యూస్ – సీ ఓటర్ సర్వే నిర్ధారించింది . ఆ మూడు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి . రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్ లలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది . కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత వల్ల కూడా ఆ మూడు రాష్ట్రాలలో బీజేపీ ఘోర పరాజయం పొందడం ఖాయమని నరేంద్ర మోడీ కి ఆయా రాష్ట్రాల ప్రజలు షాక్ ఇవ్వడం ఖాయమని లెక్కలతో సహా తేల్చి చెబుతున్నారు .

నరేంద్ర మోడీ పతనం రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛతీస్ ఘడ్ ల నుండే మొదలు అవుతుందని అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు . పెద్ద నోట్లని రద్దు చేసి సామాన్య ప్రజలను నట్టేట ముంచాడని , అలాగే జి ఎస్ టి తో కూడా మరింతగా ప్రజల జీవన విధానాన్ని నరకంగా మార్చాడని అలాగే పెట్రో ఉత్పత్తులు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నా అంటనట్లుగా , కేంద్రానికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అదే భారతీయ జనతా పార్టీ ని నట్టేట ముంచుతుందని అంటున్నారు . దేశం మొత్తం కాషాయ జెండా రెపరెపలాడాలని చూస్తున్న మోడీ అండ్ కో కు ఈ డిసెంబర్ లో షాక్ తగలడం ఖాయమని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు . రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛతీస్ ఘడ్ లతో పాటుగా తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి అయితే తెలంగాణ సర్వే మాత్రం ప్రకటించలేదు ఎందుకో !

- Advertisement -

English Title: shocking survey for bharatiya janata party

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All