Homeటాప్ స్టోరీస్మరో సినిమాను సైన్ చేసిన శర్వానంద్

మరో సినిమాను సైన్ చేసిన శర్వానంద్

మరో సినిమాను సైన్ చేసిన శర్వానంద్
మరో సినిమాను సైన్ చేసిన శర్వానంద్

హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు శర్వానంద్. ప్రస్తుతం శర్వా, సిద్ధార్థ్ తో కలిసి నటించిన మహా సముద్రం విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే నెల ఈ చిత్రం విడుదలవుతుంది. మరోవైపు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు షూటింగ్ జరుగుతోంది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ మరో చిత్రాన్ని కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకుడిగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. శర్వానంద్ తో గత కొంత కాలం నుండి టచ్ లో ఉంటున్నాడు రాజు సుందరం. ఇప్పుడు వక్కంతం వంశీ అందించిన కథ ఇద్దరికీ నచ్చింది. దీంతో ప్రాజెక్ట్ సెట్ అయినట్లే. వక్కంతం వంశీ కథ, స్క్రీన్ ప్లే అందించే ఈ చిత్రానికి రాజు సుందరం దర్శకత్వం వహిస్తాడు.

- Advertisement -

నిర్మాణ సంస్థ తదితర వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దసరాకు ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తారని వినికిడి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All