సెన్సిబుల్ చిత్రాలను ఎన్నుకునే శర్వానంద్ గత కొంత కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. లాస్ట్ గా విడుదలైన శ్రీకారం కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో ఇబ్బంది పడింది. ఇక ప్రస్తుతం శర్వానంద్ తన 30వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు ఇవ్వనున్నాడు. ఈ చిత్రాన్నీ కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నాడు.
రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో అమల అక్కినేని కీలక పాత్రలో కనిపించనుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శిలు కూడా ప్రముఖంగా కనిపించనున్నారు.
ఈ చిత్ర టైటిల్ ను సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయనున్నారు. దీనికి ఒకే ఒక జీవితం టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. శర్వానంద్ మహా సముద్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆడవాళ్ళూ మీకు జోహార్లు చిత్రానికి కూడా కమిట్ అయ్యాడు శర్వానంద్.
Presenting the first look of #Sharwa30 #OkeOkaJeevitham ????#ఒకేఒకజీవితం ????@riturv @amalaakkineni1 @vennelakishore @priyadarshi_i @twittshrees @JxBe @sujithsarang @sreejithsarang @anilandbhanu #OOJ pic.twitter.com/13KRHnkdTt
— Sharwanand (@ImSharwanand) June 28, 2021