కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా కేసులే.. కరోనా మరణాలే. ముంబై లాంటి మహా నగరంలో కరోనా విళయ తాండవం చేస్తోంది. దీంతో చాలా మంది స్వచ్ఛందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంత బాధ్యతగా భారీ స్థాయిలో విరాళాలు ప్రకటిస్తున్నారు. కొంత మంది తమ హోటళ్లనే మాచ్చి వేల మందికి ఆహారాన్ని అందిస్తున్నారు.
ఐసోలేషన్ సెంటర్లుగా మార్చి తమ వంత కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇదిలా వుంటే బాలీవుడ్ తెరపై రొమాంటిక్ చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన బాలీవుడ్ కింగ్ కాన్ షారుఖ్ ఖాన్ ముంబైలోని తన ఆఫీస్నే కరోనా పేషంట్ల కోసం వినియోగించుకోడని ముంబై నగర పాల సంస్థకు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ఒక దశలో షారుఖ్ చిత్రాలకు, రెడ్ చిల్లీస్కు సంబంధించిన కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించే భవనాన్ని కోవిడ్ బాధితుల కేసం బాలీవుడ్ బాద్ షా కేటియించడంతో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియోని షారుఖ్ సతీమణి గౌరీఖాన్ ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
Credit: Instagram