అలియా భట్ సినిమా కరోనా దెబ్బతో భారీగా నష్టాన్ని చివిచూస్తోంది. దీంతో చిత్ర బృందం సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం బాలీవుడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. అలియాభట్ నటిస్తున్న తాజా హిందీ చిత్రం `గంగూబాయి కతియావాడీ`. సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం కూడా ఈయనే అందిస్తున్నారు.
గంగూ బాయి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించడానికి ముందు ఈ చిత్రం కోసం ముంబై ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ని నిర్మించారు. గత నెల రోజులుగా లాక్డౌన్ విధించడం.. మే 3 తో లాక్డౌన్ ముగియబోతోంది. ఇదిలా వుంటే ముంబైలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.
మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో షూటింగ్ చేయడం ఇప్పట్లో కష్టమనే భావనకు వచ్చారట భన్సాలీ.
దీంతో ఫిల్మ్ సిటీలో సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ని కూల్చేయాలని నిర్ణయించుకున్నారట.
ఈ విషయాన్ని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించినట్టు తెలిసింది.