Homeటాప్ స్టోరీస్నెట్టింట వైర‌ల్‌గా మారిన మ‌హేష్ ఫొటో!

నెట్టింట వైర‌ల్‌గా మారిన మ‌హేష్ ఫొటో!

నెట్టింట వైర‌ల్‌గా మారిన మ‌హేష్ ఫొటో!
నెట్టింట వైర‌ల్‌గా మారిన మ‌హేష్ ఫొటో!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్నారు. ఇది ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ దుబాయ్‌లో జ‌రుగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని ప్ర‌స్తుతం దుబాయ్‌లో చిత్రీక‌రిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌హేష్‌బాబు త‌న అసిస్టెంట్‌తో వెళుతుండ‌గా ఓ వ్య‌క్తి ఎండ‌లో నేల‌పై కూర్చుని స్క్రిప్ట్‌కి సంబంధించి ఏదో రాస్తున్నారు. ఆ వ్య‌క్తి ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ అని నెట్టింట చ‌ర్చ న‌డుస్తోంది.

- Advertisement -

అదే నిజ‌మైతే అత‌ని హార్ద్ వ‌ర్క్‌కి, వృత‌త్తిప‌ట్ల అత‌నికున్న నిబ‌ద్ధ‌త‌కి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు. ఇదిలా వుంటే మ‌హేష్ ఇన్ స్టాలో దుబాయ్ షూటింగ్‌పై ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టారు. దుబాయ్‌లో షూటింగ్ అమేజింగ్ అని.. ఓ అద్భుత‌మైన ఎక్స్‌పీరియ‌న్స్ అన్నారు. దుబాయ్‌లోని @in5లో జ‌రిగింద‌ని, ప్ర‌తిభావంత‌మైన యువ వ్యాపార వేత్త‌లు త‌మ ఆలోచ‌న‌ల‌కు కార్య‌రూపం ఇవ్వ‌డం స్ఫూర్తినిస్తోంది. మా బృందానికి సాద‌ర స్వాగ‌తం ప‌లికిన @in5 బృందాన్ని అభినందిస్తున్నాను` అని పోస్ట్ పెట్టారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All