సూపర్స్టార్ మహేష్ నటిస్తున్న భారీ చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. `ఎఫ్2` వంటి బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ని ఆదివారం రాత్రి ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. సినిమాలో ఎంత సీరియస్ కంటెంట్ వుందో అంతే స్థాయిలో ఎంటర్టైన్మెంట్ వున్నట్టు కనిపిస్తోంది. మహేష్తో రష్మిక ఏ రేంజ్లో రచ్చ చేసినట్టు తెలుస్తోంది. `ఎఫ్2`లో అంతేగా అంతేగా.. ఏ రేంజ్లో పేలిందో దానికి మించిన స్థాయిలో రష్మిక చెబుతున్న` వింటున్నావా.. డైలాగ్ థియేటర్లలో ఓ రేంజ్లో పేలబోతున్నట్టు అర్థమవుతోంది.
చిత్ర బృందం మొదటి నుంచి చెబుతున్నట్టుగానే ట్రైన్ ఎపిసోడ్ సినిమాలో రచ్చ చేసేలాగే కనిపిస్తోంది. ఇక మధ్య మధ్యలో మహేష్పై రష్మిక కలబడిపోతున్నట్టుగానే కనిపిస్తోంది. మహేష్ చాలా రోజుల తరువాత తనదైన కామెడీ టైమింగ్తో సినిమాలో రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. ఓ పక్క యాక్షన్ సన్నివేశాల్లో హీట్ పెంచేసిన మహేష్ .. కామెడీని కూడా అదే స్థాయిలో పండించినట్టు తెలిసిపోతోంది. టోటల్ సినిమా ఎలా వుండబోతోందో ట్రైలర్తోనే పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మహేష్ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.
ట్రైలర్ చివరలో చిన్న బ్రేక్ ఇస్తున్నాను. తరువాత బొమ్మ దద్దరిల్లిపోద్ది అంటూ మహేష్ చెప్పిన డైలాగ్స్తో థియేటర్లు దద్దరిల్లిపోయేలా కనిపిస్తున్నాయి. ఈ సంక్రాంతికి మహేష్ బాబు ఫ్యాన్స్కి ఓ పక్క సీరియస్ యాక్షన్ని అందిస్తూనే మరో పక్క గిలిగింతలు పెట్టే ఎంటర్టైన్మెంట్ని అందిస్తుండటం డబుల్ ట్రీట్గా చెబుతున్నారు. థియేట్రికల్ ట్రైలర్లో మహేష్ డైలాగ్లు, లేడీ సూపర్స్టార్ విజయశాంతి నటన, రష్మిక రచ్చతో ఈ సంక్రాంతికి బొమ్మ దద్దరిల్లిపోద్ది అంతే అని ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు స్టార్ట్ చేశారు.