టాలీవుడ్లో స్టార్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు విజయ్ దేవరకొండ. `అర్జున్రెడ్డి`తో కొత్త తరహా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారి భారీ క్రేజ్ని, స్టార్డమ్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. యూత్లో క్రేజ్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ క్రేజ్ని ఓ బ్రాండ్గా మార్చుకుని రౌడీ పేరుతో వస్త్ర ప్రపంచంలో ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసి సంచలనం సృష్టించారు.
రౌడీ బ్రాండ్తో ఇప్పటికే వస్త్ర ప్రపంచంలో తిరుగులేని విజయాన్ని సాధించిన విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా కొత్త బిజినెస్ కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సరైన భాగస్వాములు దొరకడంతో వారి సహాయంతో మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ రంగంలో మహేష్, ప్రభాస్ ప్రవేశించారు. ప్రభాస్ బీమవరంలో మల్టీప్లెక్స్ థియేటర్ని నిర్మిస్తే, మహేష్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజాగా డిస్ట్రిబ్యూషన్ రంగంతో పాటు ఎగ్జిబిటర్గా వున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ థియేటర్స్ని ప్రారంభిస్తున్నారని, దీనికి ఏవీడీ అనే పేరుని నిర్ణయించినట్టు తెలిసింది. హైదరాబాద్లో ఒక మల్టీప్లెక్స్ని, మహబూబ్ నగర్ సిటీలో మనో మల్టీప్లెక్స్ని నిర్మిస్తున్నారట. ఈ రెండు మల్టీప్లెక్స్లు సమ్మర్కి బిఫోరే పూర్తి చేసి ఓపెన్ చేయాలని విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నారట.