Homeటాప్ స్టోరీస్సంక్రాంతి సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి?

సంక్రాంతి సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి?

సంక్రాంతి సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి?
సంక్రాంతి సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి?

సంక్రాంతి సినిమాల జోరు మొదలైపోయింది. ఈరోజే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ సినిమా విడుదలవుతోంది. అయితే ఇది డబ్బింగ్ సినిమా, పైగా రజినీ క్రేజ్ మునుపటితో పోల్చుకుంటే కొంత తగ్గింది. దీంతో దర్బార్ కు టికెట్లు కొంత నెమ్మదిగానే తెగుతున్నాయి. కానీ టాక్ బాగుంటే రజినీ ఎలా రెచ్చిపోతాడన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సంక్రాంతి సినిమాలకు అసలు సిసలైన జోరు మొదలయ్యేది మాత్రం జనవరి 11న అని చెప్పవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఆరోజే విడుదలవనున్న విషయం తెల్సిందే. ఒక రోజు తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలైపోయాయి.

అయితే ఈ రెండు చిత్రాల్లో దేనిది పైచేయి అంటే సరిలేరు నీకెవ్వరుకి అనే చెప్పాలి. సరిలేరు మాస్ సినిమా కావడంతో సింగిల్ స్క్రీన్లలో దీనికి క్రేజ్ మాములుగా లేదు. పెట్టినవి పెట్టినట్లే థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. అల వైకుంఠపురములో చిత్రానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి కానీ సరిలేరుతో పోల్చుకుంటే కొంచెం నెమ్మదిగానే ఉన్నాయి. అయితే మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టలేదు. ఒకసారి అది మొదలైతే పరిస్థితిలో మార్పు రావొచ్చు. ఇప్పటివరకైతే సరిలేరు నీకెవ్వరు బుకింగ్స్ ఓ రేంజ్ లో సాగుతున్నాయి. జనవరి 15న విడుదలవుతోన్న ఎంత మంచివాడవురా చిత్రానికి ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాలేదు.

- Advertisement -

సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో మధ్య బాక్స్ ఆఫీస్ పోరు చాలా ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. రెండు చిత్రాలు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. అయితే ఈ రెండిట్లో దేనికి నెగటివ్ టాక్ వచ్చినా రెండో సినిమా దూసుకెళ్లిపోవడం ఖాయం. రెండిటికి మంచి టాక్ వస్తే ఏ చిత్రం ఎక్కువగా లాభపడింది అన్నది ఆసక్తికరం. ఓపెనింగ్స్ విషయంలో మాత్రం సరిలేరు నీకెవ్వరుకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశముంది. అల వైకుంఠపురములో కంటే ఒకరోజు ముందు విడుదల కానుండడం కలిసొస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All