సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న శాకుంతలం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. ఎందుకంటే గుణశేఖర్ ఎక్కువ కాలం షూటింగ్ చేస్తాడన్న పేరుంది. సంవత్సరాలకు సంవత్సరాలు సినిమాను షూటింగ్ చేస్తాడు. అలాంటిది శాకుంతలం చిత్రాన్ని కేవలం ఐదు నెలల్లో పూర్తి చేసాడు. అందులోనూ సెకండ్ వేవ్ ఇబ్బంది కూడా ఉంది. అయినా వాటిని ఎదుర్కొంటూ శాకుంతలాన్ని పూర్తి చేసాడు.
సమంత ఈ చిత్రంపై ఎమోషనల్ గా రెస్పాండ్ అయింది. ఈ చిత్రం తన జీవితాంతం స్పెషల్ గా నిలుస్తుందని తెలిపింది. మహాకవి కాళిదాసు రచన ఆధారంగా మహాభారతంలోని ఆది పర్వంలోని ఒక భాగాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించాడు గుణశేఖర్.
రాకుమారుడు భరతగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. అతని చిన్నప్పటి పాత్రను అల్లు అర్హ పోషించింది. గుణా టీమ్ వర్క్స్ ఈ సినిమాను నిర్మించగా దిల్ రాజు సమర్పిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతాయి.