Homeటాప్ స్టోరీస్సమంత పిల్లల్ని కనాలనే అనుకుంది: శాకుంతలం నిర్మాత

సమంత పిల్లల్ని కనాలనే అనుకుంది: శాకుంతలం నిర్మాత

సమంత పిల్లల్ని కనాలనే అనుకుంది: శాకుంతలం నిర్మాత
సమంత పిల్లల్ని కనాలనే అనుకుంది: శాకుంతలం నిర్మాత

అక్కినేని నాగ చైతన్య – సమంత తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత నాగ చైతన్యకు మీడియా ద్వారా పెద్ద ఇబ్బంది కలుగలేదు కానీ సమంత మీద మాత్రం పర్సనల్ ఎటాక్ జరిగింది. ఆమె పిల్లల్ని వద్దనుకుందని, అబార్షన్ చేయించుకుందని, సినిమాల్లో బోల్డ్ గా నటించడం ఆపనని చెప్పడంతో అక్కినేని ఫ్యామిలీ ఈ నిర్ణయం తీసుకుందని ఇలా రకరకాల కారణాలతో సమంతను ఇబ్బంది పెట్టారు. వీటిపై రీసెంట్ గా సోషల్ మీడియాలో స్పందించింది. తనపై వస్తోన్న రూమర్లు అవాస్తవమని, తనపై పర్సనల్ ఎటాక్ మానుకోవాలని తెలిపింది.

ఇదిలా ఉంటే సమంత లీడ్ రోల్ లో నటించిన శాకుంతలం సినిమా నిర్మాత నీలిమా గుణా తాజాగా ఈ విషయంపై స్పందించింది. “నాన్న శాకుంతలం స్క్రిప్ట్ తో ఆమె వద్దకు వెళ్ళినప్పుడు సమంత సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని మాకు చెప్పింది.

- Advertisement -

తాను ఫ్యామిలీను మొదలుపెడదామని అనుకుంటున్నానని, పిల్లల్ని కనాలని, అందుకే సినిమాలు చేయనని చెప్పింది. అయితే నాన్న 3-4 నెలల్లో షూటింగ్ ను పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు. అనుకున్న ప్రకారంగానే జులైకే శాకుంతలం పూర్తయింది. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే వారు ఎందుకు విడిపోయారు అనేది వారి వ్యక్తిగత విషయం. కాకపోతే ఆమెపై వస్తోన్న రూమర్లు అబద్దం. ఆమె పిల్లల్ని కనాలనే అనుకుంది” అని నీలిమా గుణా తెలిపింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All