పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ `సలార్`. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇటీవలే రామగుండంతో పాటు గోదావరిఖనిలో కీలక షెడ్యూల్ని పూర్తి చేశారు.
శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ స్టోరీపై ప్రారంభం నుంచి రకరకాల వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ `ఉగ్రం` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, తాను ప్రభాస్ కోసం ప్రత్యేకంగా రాసుకున్న కథతో ఈ మూవీని రూపొందిస్తున్నానని ప్రశాంత్ నీల్ ఇటీవల వివరించారు.
అయినా ఈ మూవీపై రూమర్స్ ఆగడం లేదు. ఇక ఈ రూమర్స్ నిజమంటూ ఈ చిత్ర సంగీత దర్శకుడు రవి బాస్రూర్ స్పష్టం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రవి బాస్రూర్ ఇది `ఉగ్రం` రీమేకే కదా అంటూ అడిగిన ప్రశ్నకు `అది అందరికి తెలిసిందే కదా` అంటూ ఠక్కున్న స్లప్పయ్యారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ మూవీ స్టోరీపై వస్తున్న వార్తలకు తెరపడింది. మరి ప్రశాంత్ నీల్ ఏమంటారో చూడాలి.