యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా వున్నారు. ప్రస్తుతం ఆయన వరుసగా మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్లలో నటిస్తున్నారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `రాధేశ్యామ్` దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇదిలా వుంటే మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రారంభించిన `సలార్` ఫస్ట్ షెడ్యూల్ని కూల్గా పూర్తి చేసుకుంది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ముందే ఓం రౌత్ రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`లోనూ ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే ముంబైలోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ చిత్రీకరణ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మోషన్ క్యాప్షర్ టెక్నాలజీని తొలి సారి ఈ చిత్రానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఇటవల సెట్లో జరిగిన ప్రమాదంలో ముఖ్యమైన సెట్ ప్రారర్టీతో పాటు కీలక పరికరాలు దెబ్బబతిన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ షెడ్యూల్ మారినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. `ఆదిపురుష్` కేసం కేటాయించిన డేట్స్ని `సలార్`, నాగ్ అశ్విన్ చిత్రాలకు కేటాయిస్తారని తెలిసింది.