టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా తమ బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై చెప్పేస్తున్నారు. వరుసగా పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇటీవల దిల్ రాజు సెకండ్ మ్యారేజ్ నుంచి టాలీవుడ్లో పెళ్లిళ్ల హంగామా మొదలైంది. ఆ తరువాత అనూహ్యంగా నిఖిల్ వివాహం చేసుకున్నాడు. క్రేజీ హీరోలు నితిన్, రానా కూడా తమకు నచ్చిన అమ్మాయిల్ని ప్రేమించి వారిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ వరుసలో బ్యాచిలర్ లైఫ్కి మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ కూడా గుడ్బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాడని తెలిసింది. సాయిధరమ్తేజ్ ప్రస్తుతం `సోలో బ్రతుకే సోబెటర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పే పర్ వ్యూ అనే పద్దతిలో జీ ప్లెక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదిలా వుంటే సాయిధరమ్తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. సాయి మదర్ ఆంధ్రాకు చెందిన ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసినట్టు తెలిసింది.
ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి చెప్పడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిందని వచ్చే ఏడాది సమ్మర్లో వివాహం చేయాలని నిర్ణయించారట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారట.