టాలీవుడ్లో లాక్డౌన్తో సినిమా షూటింగ్లు తాత్కాలికంగా ఆగిపోయాయి. అయితే సినిమా షూటింగ్లు ఆగినా పెళ్లి వార్తలతో టాలీవుడ్ అంతా సందడి సందడిగా మారుతోంది. పెళ్లి బాజాలు మోగేస్తున్నాయి. పెళ్లెప్పుడంటే సిగ్గుల మొగ్గలేసిన యంగ్ హీరోలంతా సైలెంట్గా సింగిల్ లైఫ్కి గుడ్ బై చెప్పేసి పెళ్లిపీటలెక్కేస్తున్నారు.
నిఖిల్ ఇప్పటికే వివాహం చేసుకుని కొత్త లోకంలో విహరిస్తున్నాడు. నితిన్ ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే రానా ఈ రేసులో సడెన్ స్టార్లా ఎంట్రీ ఇచ్చేసి షాకిచ్చాడు. మిహీకా బజాజ్ని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించేశాడు. ఇటీవలే ఇరు కుటుంబాలంతా కలిసి రోకా ఫంక్షన్ని నిర్వహించారు కూడా.. ఇదిలా వుంటే మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో పెళ్లికి రెడీ అయిపోతున్నాడంటూ నాగబాబు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ వార్తపై సాయిధరమ్తేజ్ ఫన్నీగా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా వరుణ్తేజ్ని `ఏంటీ బావా పెళ్లంటగా` ంటూ అడిగేశాడు. దీనికి వరుణ్తేజ్ అంతే ఫన్నీగా సమాధానం చెప్పాడు. `దానికి చాలా టైమ్ వుందిలే కానీ మన రానా దగ్గుబాటి, నితిన్ ఫర్ ఎవర్ విత్ యూ అంటూనే సింపుల్గా సింగిల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు` అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Enti bava @IAmVarunTej neeku pellanta? ??? pic.twitter.com/0jEWbDe5PU
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 23, 2020
Credit: Twitter