మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం రిపబ్లిక్ విడుదలకు ముస్తాబైంది. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. సాయి ధరమ్ తేజ్, పంజా అభిరామ్ పాత్రలో కలెక్టర్ గా నటించిన ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. టాలెంటెడ్ దర్శకుడు దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ కావడంతో రిపబ్లిక్ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేక వాయిదా పడుతుందా అని ముందు అనుకున్నారు కానీ నిర్మాతలు అనుకున్న డేట్ కే ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం కుదుటపడింది. త్వరలోనే డిశ్చార్జ్ కూడా అవుతున్నాడు.
అయితే ఈలోగా తేజ్ చిత్రాన్ని ప్రమోట్ చేసే బాధ్యతను మెగాస్టార్ తీసుకున్నాడు. రిపబ్లిక్ ట్రైలర్ ను రేపు ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయనున్నాడు. జెబి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ హోల్ సేల్ గా సొంతం చేసుకుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు.
Our Mega Star @KChiruTweets garu for Supreme Hero @IamSaiDharamTej #MegaStarForSDT #RepublicTrailer Releasing Tomorrow at 10 AM.#Republic #RepublicFromOct1st@aishu_dil @devakatta #ManiSharma @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ @ZeeMusicCompany @JBhagavan1 @j_pullarao pic.twitter.com/7LC9LKk79M
— JB Entertainments (@JBEnt_Offl) September 21, 2021