యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు రోడ్ యాక్సిడెంట్ జరిగి అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతోన్న విషయం తెల్సిందే. అప్పటినుండి వెంటిలేటర్ పై ఉండి కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ కు సంబంధించి తాజా హెల్త్ బులెటిన్ బయటకు వచ్చింది. ప్రస్తుతం తేజ్ కోలుకుంటున్నాడని, సృహలోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు. అలాగే వెంటిలేటర్ సపోర్ట్ కూడా తొలగించారట.
అయితే మరికొంత కాలం హాస్పిటల్ లోనే వైద్యుల పర్యవేక్షణలో సాయి ధరమ్ తేజ్ ఉండాలని అన్నారు. ఇప్పటికే తేజ్ ను చూడటానికి హాస్పిటల్ కు స్టార్ హీరోలు అందరూ వచ్చారు. అలాగే నిన్న బిగ్ బాస్ స్టేజ్ మీద రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చాడు.
తేజ్ కు ఇప్పుడు చాలా బాగుందని, సరిగ్గా కోలుకుంటున్నాడని.. తనకు తగిన సమయం ఇచ్చి పూర్తిగా కోలుకున్నాకే బయటకు రమన్నామని రామ్ చరణ్ అన్నాడు. ఇక తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదలకు సిద్ధమైన విషయం తెల్సిందే.