కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయిందని ప్రచారం జరుగుతోంది. కానీ రియాలిటీకి వచ్చే సరికి దాని ప్రభావం అలాగే వుందని జరుగుతున్న సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఇటీవల వరుసగా సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటంతో సినీ స్టార్స్ అంతా భయాందోళనకు గురవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.
దీంతో గత ఏడు నెలలుగా ఆగిపోయిన తమ చిత్రాల షూటింగ్లని స్టార్ హీరోలు.. క్రేజీ హీరోలు ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. మెగా హీరో సాయిధరమ్తేజ్ కూడా తన పొలిటికల్ థ్రిల్లర్ని ఇటీవలే మొదలుపెట్టారు. లాక్డౌన్ బిఫోర్ పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది హీరో సాయిధరమ్తేజ్ నుంచి ప్రధాన తారాగణం, టెక్నీషియన్స్ కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా టీమ్ పక్కా ప్రణాళికతో షూట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎనిమిది నెలలు ఆలస్యం అయిన ఈ ప్రాజెక్ట్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని దేవా కట్టా ప్లాన్ చేస్తున్నారు.