ఐశ్వర్యా రాజేష్కు తెలుగులో మెగా ఆఫర్ లభించింది. కౌసల్యాకృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఐశ్వర్యారాజేష్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వైఫల్యాన్ని చవిచూసినా తాజాగా ఐశ్వర్యా రాజేష్కు తెలుగులో మరో ఆవకాశం దక్కింది.
`ప్రస్థానం` వంటి పొలిటికల్ థ్రిల్లర్తో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న దేవా కట్టా కొంత విరామం తరువాత సాయి ధరమ్తేజ్తో ఓ భారీ పొలిటికల్ థ్రిల్లర్ని తెరకెక్కిస్తున్నారు. లాక్డౌన్కి ముందే పూజా కార్యక్రమాలు జరిగినా ఇంత వరకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇందులో సాయిధరమ్తేజ్కు జోడీగా నివేదా పేతురాజ్ని ఎంపిక చేశారు. ఓపెనింగ్ కార్యక్రమాల్లోనూ పాల్గొంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఫెర్ఫార్మెన్స్కి స్కోప్ వున్న పాత్ర కావడంతో ఆమె స్థానంలో ఐశ్వర్యారాజేష్ని దర్శకుడు ఫైనల్ చేసి నివేద పేతురాజ్ని తప్పించినట్టు తెలిసింది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో మొదలైంది. ఐశ్వర్యా రాజేష్ షూట్లో పాల్గొంటోంది. ఈ మూవీతో పాటు ఐశ్వర్యారాజేష్ ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న `టక్ జగదీష్`లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.