సుశాంత్ సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నాటకీయ పరిణామాలు, ట్విస్ట్లు, టర్న్లతో సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించేలా రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ మృతి చుట్టూ పెద్ద వ్యవహరమే నడిచినట్టు తేలడం, రియాకు డ్రగ్స్ డీలర్లకు మద్య వాట్సాప్ సంభాషణ జరగడంతో ఈ కేసుని డ్రగ్స్ కోణంలో విచారించడం మొదలైంది. ఎన్సీబీ వర్గాలు రంగంలోకి దిగి రియాను గత మూడు రోజులుగా విచారించారు. తనకు డ్రగ్స్ అలవాటు వుందని, సుశాంత్కు రియానే డ్రగ్స్ అలవాటు చేసిందని తేలడంతో ఎస్సీబీ అధికారులు మంగళవారం ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రియాని మెజిస్టేట్ ముందు హాజరు పరచడంతో ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ ని విధించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం ఉదయం రియాకు ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. బెయిల్ పిటీషన్ కోసం అభ్యర్థించినా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. అయితే రియా బెయిల్ కోసం ఈ రోజు సెషన్స్ కోర్టుని ఆశ్రయించే అవకాశాలున్నాయని తెలిసింది.
రియాని నార్కొటిక్స్ కంట్రోల్ బోర్డ్ బ్యూరో గత మూడు రోజులుగా విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో బాలీవుడ్కు చెందిన 21 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నారని రియా వెల్లడించినట్టు సమాచారం.