తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని యాంకర్ ఉదయ భాను స్వీకరించడం, ఆ తరువాత బ్రమ్మానందంకు ఛాలెంజ్ విసరడం వంటివి తెలిసిందే. 3వ విడతలో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టాలీవుడ్లో జోరందుకుంది. ప్రభాస్తో మొదలైన ఈ ప్రక్రియ రోజు రోజుకీ విస్తరిస్తోంది.
తాజాగా ఈ ఛాలెంజ్ని పవన్స్టార్ పవన్కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ స్వీకరించారు. తన కూతురు ఆద్యతో కలిసి జూబ్లీ హిల్స్ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం రేణు దేశాయ్ మాట్లాడుతూ `ప్రస్తుత జీవన విధానంలో మనమందరం అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడ్డామని, చిన్నతనంలో స్వంత గృహాలలో వుండటం వల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్లు మొక్కలు నాటుతుంటే చూసి నేర్చుకునేవాళ్లం. కానీ ఈ కొత్త తరానికి చెట్లని ఎలా నాటాలి? ఎలా పెంచాలి అనే విషయం తెలియచేయడం లేదు. అందుకే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి నా కూతురు ఆద్యని, తన స్నేహితురాలు యషకని మొక్కలు నాటించడం కోసం తీసుకువచ్చాను.
ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నా కూతురుతో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా వుంది. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత. మొక్కలు అందరు నాటాలి` అని అన్నారు.
By accepting #greenindiachallenge given by anchor #UdayaBhanu,actress #RenuDesai along with daughter #Aadya planted saplings today.
Further requested everyone to self nominate for this and take care of environment.
Thanked @MPsantoshtrs for his efforts for this #HarithaHaaram. pic.twitter.com/fFE8TkhZGK
— BARaju (@baraju_SuperHit) July 3, 2020