Homeటాప్ స్టోరీస్మొక్క‌లు నాటిన బ్ర‌హ్మానందం!

మొక్క‌లు నాటిన బ్ర‌హ్మానందం!

మొక్క‌లు నాటిన బ్ర‌హ్మానందం!
మొక్క‌లు నాటిన బ్ర‌హ్మానందం!

తెరాస రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మూడ‌వ విడ‌త‌ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని ఇటీవ‌ల ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీవీ స్టార్‌లు, యాంక‌ర్‌లు, సినీ స్టార్‌లు పాల్గొన్నారు. స్టార్ హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో ఆ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ ఛాలెంజ్‌లో హాస్య నటుడు బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం పాల్గొన్నారు.

క్రేజీ యాంక‌ర్ ఉద‌య‌భాను మొక్క‌లు నాటి విసిరిన ఛాలెంజ్‌ని స్వీక‌రించిన హాస్య‌బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం  మ‌ణికొండ‌లోని త‌న నివాసంలో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఉద‌య‌భాను న‌టుడు బ్ర‌హానందంకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సృష్టిని కాపాడేందుకు ఒంటి కాలిపై త‌ప‌స్సు చేస్తున్నది ఒక్క చెట్టు మాత్ర‌మే అని ఇది అక్ష‌ర స‌త్య‌మ‌ని, ప్ర‌కృతి ప‌ట్ల త‌న‌కున్న బాధ్య‌తను బ్ర‌హ్మానందంగారు నాతో పంచుకున్నారు` అని తెలిపింది ఉద‌య‌భాను.

- Advertisement -

రాజ్యస‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్ చాలా మంచి కార్యక్ర‌మాన్ని చేప‌ట్టార‌ని, అందుకు ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని పేర్కొంది. బ్ర‌హ్మానందంగారు చెట్లు నాటిన ఫొటోలు చూస్తుంటే నేల త‌ల్లిపై కూర్చుని త‌న త‌ల్లికి సేవ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నాయ‌ని, ఆయ‌న‌ని ఆద‌ర్శంగా తీసుకుని చాలా మంది మొక్క‌లు నాటాల‌ని ఆశిస్తున్నాన‌ని ఉద‌య‌భాను అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All