కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న చిత్రం `ఇండియన్ 2`. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. క్రేన్ యాక్సిడెంట్ కారణంగా వార్తల్లో నిలిచిన ఈ మూవీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. డైరెక్షన్ టీమ్కు చెందిన వారితో పాటు ప్రొడక్షన్ టీమ్కి చెందిన వారు మొత్తం ముగ్గురు చనిపోవడంతో ఈ మూవీ షూటింగ్పై నీలినీడలు కమ్ముకున్నాయి.
తాజాగా ఈ మూవీ నుంచి ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజంగా ఇండియన్ టీమ్ కి పెద్ద షాకే అంటున్నారు. చిత్రీకరణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తనకు వేరే ప్రాజెక్ట్స్ వుండటంతో రత్నవేలు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారట. దీంతో టీమ్ మొత్తం షాక్లో వుందని చెబుతున్నారు.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా కీలక పాత్రల్లో రకుల్ ప్రీత్సింగ్, సిద్ధార్ధ్ కనిపించబోతున్నారు. ముందు ఈ ప్రాజెక్ట్ నుంచి రవివర్మన్ తప్పుకోగా రత్నవేలుని తీసుకున్నారు. ఇప్పడు ఆయన స్థానంలో ఎవరిని శంకర్ లైన్లోకి తీసుకొస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.