కమల్హాసన్ 2016లో తన ఆఫీసు ఆవరణలో ఆ మధ్య అదుపు తప్పి కిందపడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కాలికి గాయాలయ్యాయి. అప్పట్లో సర్జీరీ అవసరం వున్న కమల్ హాసన్ లైట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అదే గత కొంత కాలంగా ఆయనని తీవ్రంగా బాధిస్తోంది. దీంతో ఆయన సర్జరీ చేయించుకున్నారట.
చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్లో కమల్కు సర్జరీ జరిగిందని, డా. మోహన్కుమార్, డా. జేఎస్ ఎన్ మూర్తి …కమల్కు విజయవంతంగా సర్జరీ చేశారట. ఈ విషయాన్ని తాజాగా శృతిహాసన్, అక్షరా హాసన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. `మా నాన్న చాలా బాగున్నారు. మంచి స్పిరిట్తో స్పీడ్గా రికవర్ అవుతున్నారు. ఆయన హెల్త్కు సంబంధించిన తాజా అప్డేట్ ఇదిగో అంటూ ఓ లెటర్ని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
గత కొంత కాలంగా కాలి గాయం కారణంగా కమల్ బాధపడుతున్నారట. ఇటీవల మరింత తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో బాధను భరించలేకపోయారట, దీంతో డాక్టర్లని సంప్రదిస్తే సర్జరీ తప్పనిసరి అని తేల్చారు. తాజాగా కమల్కి చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్లో కమల్కు సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని. అందరి ప్రార్థనల వల్ల ఆయన క్షేమంగా కోలుకుంటున్నారని శృతిహాసన్, అక్షరా హాసన్ తాజాగా వెల్లడించారు.