Homeటాప్ స్టోరీస్ఆ వార్త‌లు విని షాక‌య్యాను - శంక‌ర్‌

ఆ వార్త‌లు విని షాక‌య్యాను – శంక‌ర్‌

ఆ వార్త‌లు విని షాక‌య్యాను - శంక‌ర్‌
ఆ వార్త‌లు విని షాక‌య్యాను – శంక‌ర్‌

ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు వున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న నుంచి సినిమా వ‌స్తోందంటే యావ‌త్ దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్‌తో `ఇండియ‌న్ 2` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా శంక‌ర్‌పై చెన్నైకి చెందిన ఎగ్మోర్ మెట్రోపాలిట‌న్ కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్‌ని జారీ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ వార్త‌ల‌పై తాజ‌గా ద‌ర్శ‌కుడు శంక‌ర్ స్పందించారు. త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, అవ‌న్నీ అవాస్త‌వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా ఓ లెట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ లెట‌ర్‌లో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. `ఎగ్మోర్ మెట్రోపాలిట‌న్ కోర్టు త‌న‌కు నాన్ బెల‌యిబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన‌ట్టు వార్త‌లు విని షాక‌య్యాను. వెంట‌నే మా లాయ‌ర్ సాయికుమార‌న్ ఈ విష‌యంపై వివ‌ర‌ణ కోర‌గా ఆన్‌లైన్ కోర్టులో జ‌రిగిన చిన్న పొర‌పాటు వ‌ల్ల ఆ నోటీసులు వ‌చ్చాయ‌ని న్యాయ‌మూర్తి వెల్ల‌డించారన్నారు.

- Advertisement -

పూర్తి స‌మాచారాన్ని తెలుసుకోకుండా ప్ర‌చురించిన ఈ వార్త‌ల కార‌ణంగా త‌న కుటుంబ స‌భ్యులు.. బుధువులు, స్నేహితులు క‌ల‌వ‌రానికి గుర‌య్యార‌ని వెల్ల‌డించారు. ద‌య‌చేసి ఇక‌పై పూర్తి స‌మాచారాన్ని తెలుసుకోకుండా తొంద‌ర‌ప‌డ‌కుండా వార్త‌లు రాయ‌ర‌ని ఆశిస్తున్నాను` అని ద‌ర్శ‌కుడు శంక‌ర్ స‌ద‌రు లేఖ‌లో వెల్ల‌డించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All