మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఓ బారీ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంపై గత కొంత కాలంగా రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏప్రిల్ 13 న ఉగాది సందర్భంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ 30 చిత్రాన్ని లాంచ్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఇందులో హీరోయిన్ ఎవరనేది చర్చగా మారింది. గత కొన్ని రోజులగా ఇందులో ఎన్టీఆర్కు జోడీగా పూజా హెగ్డేను ఫైనల్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే త్రివిక్రమ్ గత రెండు చిత్రాల్లోనూ పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకున్నారు.
మరోసారి ఆమెని రిపీట్ చేయకుండా రష్మికని ఫైనల్ చేసుకోవాలనుకుంటున్నారట. ఇటీవలే రష్మిక మందన్న దర్శకుడు త్రివిక్రమ్ను కలుసుకుని స్టార్ డైరెక్టర్తో చర్చలు జరిపారట. చిత్ర బృందం ఆమెనే ఫైనల్ చేస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్తో కలిసి సుకుమార్ రూపొందిస్తున్న `పుష్ప`లో నటిస్తోంది.