గత ఏడు నెలలుగా ఆగిపోయిన షూటింగ్లు మళ్లీ మొదలవుతున్నాయి. స్టార్ హీరోల చిత్రాల నుంచి చిన్న హీరోల మూవీస్ వరకు అన్నీ సెట్స్ పైకి వచ్చేస్తున్నాయి. రానాదగ్గుబాటి కూడా సెట్లో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. తను నటిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తోంది.
ఇటీవల వివాహం చేసుకున్న రానా దగ్గుబాటి ఎట్టకేలకు తన రాబోయే చిత్రం షూటింగ్లో చేరడానికి బయలుదేరాడు. కరోనా కారణంగా షూటింగ్లు ఆగిపోవడం… వంటి కారణాలతో ఇంటి పట్టునే వున్న రానా ఈ మధ్యే హనీమూన్కి వెళ్లొచ్చారు. ప్రస్తుతం ఫ్రీ కావడం, తను నటిస్తున్న సినిమా సెట్స్పైకి వెళ్ళడంతో రానా కూడా సెట్లోకి ఎంటరయ్యారు.
ఈ సందర్భంగా ఓ ఫొటోని షేర్ చేసిన రానా దానితో పాటు ఆసక్తికర పోస్ట్ని షేర్ చేశారు. `చాలా కాలం తరువాత షూటింగ్లో పాల్గొంటుండటం ఆనందంగా వుందని వెల్లడించారు. రానా నటించిన మరో చిత్రం `అరణ్య`. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేస్తున్నారు.