శివగామి.. నా మాటే శాసనం.. అంటూ `బాహుబలి` చిత్రంలో తనదైన నటనతో జేజేలు అందుకుంది. ఈ రెండు సిరీస్లతో రమ్యకృష్ణ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. దీంతో ఆమె కీలక పాత్రలో సినిమా అంటే సర్వత్రా ఆసక్తినెలకొంటోంది. `బాహుబలి` తరువాత రమ్యకృష్ణ నటించిన తొలి వెబ్ సిరీస్ `క్వీన్`. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పురుచ్చితలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ అభినయానికి ప్రశంసల వర్షం కురిసింది.
ఛాలెంజింగ్ రోల్లో రమ్యకృష్ణ చూపించిన పెర్ఫార్మెన్స్కు ఆసియా అకాడమీ క్రియేటీవ్ ఆవార్డ్స్లో బెస్ట్ ఒరిజినల్ ప్రోగ్రాంగా గౌరవం దక్కింది. దీంతో `క్వీన్` సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో `క్వీన్` సీజన్ టులో నటించడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నానని రమ్యకృష్ణ చెబుతోంది.
మ్యాక్స్ ప్లేయర్లో విడుదలైన `క్వీన్` విశేష ఆదరణను సొంతం చేసుకుంది. వెబ్ సిరీస్ వరల్డ్లో దక్షిణాదిలో అత్యంత పాపులర్ అయిన వెబ్ సిరీస్గా నిలిచింది. దీనికి సీక్వెల్ సీరీస్ 2ని త్వరలో ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతోంది.