సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘నవాబ్’.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా
అదితి రావు హైదరి ,ఐశ్వర్య రాజేష్ ,డయానా లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.. ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతుంది.. కాగా ఈ సినిమా లో మొదటి సారి హీరోయిన్ గా పరిచయమవుతున్న డయానా సినిమా పై మంచి హోప్స్ పెట్టుకుంది.. ఈ సినిమా తో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఆఫర్స్ దక్కించుకునే ప్రయత్నంలో ఉంది.. ఇప్పటికే లుక్ లో సూపర్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ నటన లోనూ పర్వాలేదు అనిపించుకుంటే టాలీవుడ్ ను ఎలేస్తుంది మరీ..