టాలీవుడ్లో వున్న స్టైలిష్ డైరెక్టర్ పూరిజగన్నాథ్. తెలుగు లో ఆయన తీసినంత ఫాస్ట్గా ఇంత వరకు ఎవరూ సినిమాలు పూర్తి చేయలేదు. వర్మకు తగ్గ శిష్యుడిగా మేకింగ్ విషయంలో పేరుతెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఇటీవల `ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెలిసిందే. క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో `ఫైటర్` చిత్రాన్ని సొంత బ్యానర్ లో ప్లాన్ చేస్తున్న పూరి మరో పక్క తనయుడు ఆకాష్తో `రొమాంటిక్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనిల్ పాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలీవుడ్ హాట్ మోడల్ కేతికా శర్మ కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల గోవాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. అయితే ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ హాటీ మందిరా బేడీని అనుకున్నారట. అమెతో సంప్రదింపులు జరిపి చివరికి ఫైనల్ చేసుకున్నారట. అయితే మధ్యలో ఏమైందో ఏమో తెలియదుకానీ మందిర ఈ సినిమా నుంచి తప్పుకుందని, ఆమె స్థానంలో రమ్యకృష్ణని ఫైనల్ చేశారని తెలిసింది.
సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ని చిత్రబృందం ఇటీవలే రిఈజ్ చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్నా ఈ సినిమా ద్వారా హీరోగా ఆకాష్ని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు పూరి జగన్నాథ్. మకరంద్ దేశ్పాండే, ఉత్తేజ్, సునైనా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.