ఎనర్జిటిక్ హీరోగా రామ్ `ఇస్మార్ట్ శంకర్`తో తొలి మాస్ హిట్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత కొంత విరామం తీసుకున్న రామ్ తాజాగా సంక్రాంతికి థ్రిల్లర్ ఎంటర్టైనర్ `రెడ్`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.
పక్కాగా చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. సంక్రాంతి సీజన్ కావడం వల్ల ఈ మూవీ ఆ మాత్రం కలెక్షన్లని రాబట్ట గలిగిందే కానీ అదే మరో సమయంలో రిలీజ్ అయివుంటే పెద్దగా ప్రభావాన్ని చూపించేది కాదు. ఫ్లాప్ గా నిలిచేది. దీంతో రామ్ తన తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డారట.
మాటల మాంత్రికుడితో సినిమా చేయాలని చాలా రోజులుగా రామ్ ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. తాజాగా రామ్ తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్తో చేయబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇది ఇప్పట్లో మెటీరియల్ అయ్యేలా కనిపించడం లేదు. త్రివిక్రమ్ ముందు ఎన్టీఆర్ చిత్రాన్ని పూర్తి చేయాలి ఆ తరువాతే తరువాత ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడు. దీంతో రామ్ తన తదుపరి చిత్రాన్ని మీడియం రేంజ్ దర్శకుడితో చేయాల్సిందే అనే వాదన వినిపిస్తోంది. రామ్ మాత్రం ఇప్పటికీ నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.