రామ్ నటించిన తాజా చిత్రం `రెడ్`. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాల్వికశర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఊహించినట్టుగానే భారీ ఓపసెనింగ్స్ని రాబట్టింది. `ఇస్మార్ట్ శంకర్` వంటి మాసీవ్ హిట్ తరువాత రామ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో మంచి ఓపెనింగ్స్ లభించాయి.
రామ్ ద్విపాత్రాభినయం చేయడం, యాక్షన్ థ్రిల్లర్ కావడం వంటి ప్రత్యేకతల మధ్య విడుదలైన ఈ మూవీ మంచి టాక్ని సొంతం చేసుకుంది. తొలి రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 6.70 కోట్లు షేర్ని వసూలు చేసింది. రెండవ రోజు కూడా అదే ఊపుని కొనసాగించి రెండవ రోజు 4. 17 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజులకు `రెడ్` 10. 87 కోట్ల షేర్ని వసూలు చేయడం విశేషం.
ఈ మూవీ రెండు రోజుల ఏపీ అండ్ తెలంగాణ కలెక్షన్స్ వివరాలు
నైజామ్ : 3.66 కోట్లు
సీడెడ్ : 1.80 క్రోర్స్
కృష్ణా : 60.4 లక్షలు
గుంటూరు : 67.6 లక్షలు
వెస్ట్ గోదావరి : 1.55 కోట్లు
ఈస్ట్ గోదావరి : 1.10 కోట్లు
ఉత్తరాంధ్ర : 90 లక్షలు
నెల్లూరు : 58 లక్షలు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో వసూలు చేసిన మొత్తం 10.87 కోట్లు