Homeటాప్ స్టోరీస్ట్రాక్ మార్చిన ఇస్మార్ట్ శంక‌ర్‌!

ట్రాక్ మార్చిన ఇస్మార్ట్ శంక‌ర్‌!

ట్రాక్ మార్చిన ఇస్మార్ట్ శంక‌ర్‌!
ట్రాక్ మార్చిన ఇస్మార్ట్ శంక‌ర్‌!

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ట్రాక్ మారుస్తున్నాడు. ఇటీవ‌ల పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించిన మాస్ మ‌సాల క్రైమ్ థ్రిల్ల‌ర్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రంతో రామ్ కెరీర్‌లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్నారు. ఇందులో ఆయ‌న గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రీతో మెస్మ‌రైజ్ చేసి షాకిచ్చిన రామ్ తాజాగా మ‌రో థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.

రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం `రెడ్‌`. త‌మిళ హిట్ చిత్రం `త‌డమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళ‌విక శ‌ర్మ‌, నివేదా పేతురాజ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భించింది.

- Advertisement -

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే దేశ వ్యాప్లంగా క‌రోనా వైర‌స్ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న నేప‌థ్యంలో రిలీజ్ డేట్ వాయిదా ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఏప్రిల్ 14 వ‌ర‌కు వుండ‌టంతో `రెడ్‌` 9న రిలీజ్ కావడం క‌ష్ట‌మే అంటున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత రామ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు మారుతికి ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది. మారుతి ఇటీవ‌ల `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంతో హిట్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All