ఆర్జీవి బంధు ప్రీతికి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఇటీవల యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ నేపోటిజమ్ కారణంగా మృతి చెందారని బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా మంది బాలీవుడ్ లో బంధు ప్రీతీ అధికంగా ఉందని దీనికారణంగానే ఇండస్ట్రీలో అశాంతి నెలకొందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
దీనిపై కరణ్ జోహార్ స్పందించారు. బంధు ప్రీతీ వల్లే ఇండస్ట్రీ ముందుకు వెళుతోందని నేపాటిజమ్ ని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. దీంతో నెటిజన్స్ కరణ్ జోహార్ పై మండిపడ్డారు. ఇదిలావుంటే రామ్ గోపాల్ వర్మ బంధుప్రీతికి బ్రాండ్ అబాసిడర్ గా వ్యాఖ్యలు చేయడం సంచలంగా మారింది.
బంధు ప్రీతి అనేది ప్రతిరంగంలో ఉండాల్సిందే. అది లేకపోతె ఇండస్ట్రీ ముందుకు సాగదు. ఏ రంగంలో అయినా పక్షపాతం ఉండాల్సిందే. లేకపోతె సమాజమే కుప్పకూలిపోతుంది. ఈ విషయంలో కరణ్ జోహార్ వాదన సరైనదే’ అంటూ కరణ్ జోహార్ని , నేపోటిజమ్ ని వర్మ సపోర్ట్ చేయడం విడ్డురంగా ఉందని నెటిజన్స్ వర్మ పై సెటైర్ లు వేస్తున్నారు.
- Advertisement -