వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలని అడ్డుకున్నారు సెన్సార్ బోర్డు సభ్యులు దాంతో దర్శకులు రాంగోపాల్ వర్మ కోర్టు కెక్కడానికి సిద్దమయ్యాడు . లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ చేసిన సభ్యులు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు . కావాలంటే ఏప్రిల్ 11 తర్వాత ఇస్తామని పేర్కొనడంతో షాక్ అయిన వర్మ కోర్టుకెక్కాలని నిర్ణయం తీసుకున్నాడు .
సెన్సార్ అయిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనని అంతేకాని ఏప్రిల్ 11 వరకు రిలీజ్ చేయడానికి వీలు లేదని చెప్పడం ఏంటని మండిపడుతున్నాడు రాంగోపాల్ వర్మ . లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు ని విలన్ గా చూపించడంతో తెలుగుదేశం శ్రేణులు వర్మ పై ఆగ్రహంగా ఉన్నారు . ప్రస్తుతానికైతే సెన్సార్ సమస్య వల్ల ఇబ్బంది ఎదురయ్యింది మరి కోర్టులో ఏం తేలుతుందో చూడాలి .
English Title: Ram Gopal varma shocked with censor board