ఎక్కడ వివాదం వుంటే దాని చుట్టూ కథ అల్లుకుని అక్కడే తిష్టవేసుకుని ఓ ఆట ఆడుకోవడం రామ్గోపాల్వర్మకు వెన్నతో పెట్టిన విద్య. దర్శకుడిగా తన పని అయిపోయిందిక దుకాణం సర్దేసుకోవాల్సిందే అన్న ప్రతీసారీ ఇదే తరహా కాన్సెప్ట్తో గోడకు కొట్టిన బంతిలా పాపులర్ అవుతూనే వున్నారు. రెగ్యులర్గా బ్లాక్ బస్టర్ సినిమాలు తీసే దర్శకులని మించి పబ్లిసిటీని పొందుతూనే వున్నారు.
తాజాగా క్లైమాక్స్ అంటూ మియా మాల్కోవాతో ఓ మూవీని రూపొందించి ట్రైలర్ని వదిలి షాకిచ్చిన వర్మ తాజాగా ఆగస్త్య మంజుతో నిర్మించిన చిత్రం `కరోనా వైరస్`. ఉదయమే ఈ సినిమా గురించి వెల్లడించిన వర్మ చెప్పినట్టుగానే మంగళవారం సాయంత్రం ట్రైలర్ని రిలీజ్ చేశాడు. తెలంగాణలో రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా అంటూ బ్రేకింగ్ న్యూస్తో మొదలైన ఈ ట్రైలర్ ఓ మధ్య తరగతి కుటుంబంలో ఓ అమ్మాయి దగ్గడంతో సీరియస్ మోడ్లోకి ఓ థ్రిల్లర్ సినిమా మోడ్లోకి వెళ్లిపోతుంది.
కరోనా వైరస్ భయంతో ఇంట్లో వాళ్లే ఆ అమ్మాయిని చూసి భయపడుతుండటం..దగ్గర కూర్చోవడానికి కూడా జంకుతున్న దృశ్యాల్ని చూపించారు. ట్రైలర్లో చివరగా ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా కట్టడికి పారసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని ఒకరు.. బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందని మరొకరు చెప్పిన వాయిస్ని వాడుకున్నాడు వర్మ. అంటే వైరస్ పై తీసిన ఈ సినిమాతో ఉభయ రాష్ట్రాల సీఎంలతో ఆడుకోవాలనుకుంటున్నాడా? లేక వారిపై సెటైరికల్గా ఈ కరోనా వైరస్ చిత్రాన్ని నిర్మించాడా అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.