సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో సినీ రంగ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో గురువారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. తలసాని నుంచి థియేటర్ల రీఓపెన్, షూటింగ్ల ప్రారంభం విషయంలో ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో శుక్రవారం చిత్ర పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తులు చిరంజీవితో సహా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుని శుక్రవారం ప్రగతి భవన్లో కలుసుకున్నారు.
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్తో సామవేశం అయిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, దిల్ రాజు, రాజమౌళి, అల్లు అరవింద్, ఎన్.శంకర్, సి.కల్యాణ్, కొరటాల శివ వున్నారు. లాక్డౌన్ కారణంగా యావత్ చిత్ర పరిశ్రమ స్థంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో 14 వేల మంది రోజు వారీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ మరింత పొడిగించి, షూటింగ్లకు అనుమతివ్వకపోతే కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం వుందని ఈసందర్భంగా చిరంజీవి మంత్రికి ఇప్పటికే వెల్లడించారు.
అదే విషయాన్ని సీఎం కేసీఆర్కు చిరంజీవితో పాటు రాజమౌళి వెల్లడించే అవకాశం వుందని, తెలుగుస్తోంది. నిబంధనలకు లోబడి షూటింగ్లు చేసుకుంటామని, అందుకు సంబంధించిన ఓ మాక్ వీడియోని రాజమౌళి ఈ సమావేశంలో ప్రదర్శించనున్నారని, దీన్ని చూసైనా షూటింగ్లకు అనుమతులు ఇవ్వాలని తాజా మీటింగ్లో ముఖ్యమంత్రికి వెల్లడించనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారా? అని యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు. I wholeheartedly thank Hon’ble CM #KCR garu on behalf of the Film, TV & Digital Media industries for granting a patient hearing & his kind reassurance.??
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2020