అభిమానులకు, ప్రేక్షకులకు తన జన్మదినం రోజున ఒక భావోద్వేగ భరితమైన సందేశం పంచుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. భారత్ దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 21 రోజులపాటు అనగా వచ్చే నెల 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల పనులు నిలిచిపోయాయి. సినిమా సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు.
సమాజానికి ఏదైనా సమస్య వచ్చిన నేపథ్యంలో ముందుగా స్పందించే మెగా ఫ్యామిలీ తరపున రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే 75 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం కూడా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్న రామ్ చరణ్ తేజ్… ఈ సంవత్సరం తన పుట్టినరోజు వేడుకలను కూడా రద్దు చేశారు. అభిమానులకు కూడా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని… ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని రామ్ చరణ్ కోరారు.
“ అర్ధరాత్రి నుంచి మీరు పంపిస్తున్నా సందేశాలు మరియు శుభాకాంక్షలు నాకు చేరుతున్నాయి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలను అనుసరించి ఈ సంక్షోభం తొలగిపోయే వరకూ.. అందరూ మీ ఇంటి వద్దనే ఉండి అన్ని రకాల జాగ్రత్తలు పాటించండి. మీ వద్ద నుంచి నేను కోరుకొనే అతి పెద్ద బహుమతి అదే.” అని రామ్ చరణ్ తేజ్ ట్వీట్ చేశారు.
I am amazed by all the heartfelt wishes pouring in since midnight! Love you all. ?
With all this, there’s one gift that I’d like from you all. Please, please stay at home till the lockdown ends! That’s the best gift you all can give me! 🙂 #StayHomeStaySafe— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2020
Credit: Twitter