మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలు కీలక సన్నివేశాల్ని చిరుపై చిత్రీకరించారు. చిరు, రెజీనా పాల్గొనగా నైట్ ఎఫెక్ట్లో ఓ స్పెషల్ సాంగ్ని షూట్ చేశారు. సినిమాలో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా, నక్సలైట్గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొరటాల తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు.
సినిమాలో 30 నిమిషాల నిడివితో సాగే స్టూడెంట్ లీడర్ పాత్ర కోసం ముందు రామ్చరణ్ని అనుకున్నారు. అయితే `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ కారణంగా డేట్స్ కుదరకపోవడం, రాజమౌళి అంగీకరించకపోవడంతో ఆ స్థానంలో మహేష్ని తీసుకోవాలనుకున్నారు. కానీ రెమ్యునరేషన్ సమస్య కారణంగా ఈ చిత్రం నుంచి మహేష్ తప్పుకోవడంతో మళ్లీ సీన్లోకి రామ్చరణ్ వచ్చేశారు. ఇక చరణ్తో షూటింగ్ స్టార్ట్ చేయాలని కొరటాల శివ డిసైడ్ అయ్యారట. అయితే తాజా పరిస్థితి కరోనా కారణంగా అదుపు తప్పుతుండటంతో షూటింగ్ని వాయిదా వేశారు.
పరిస్థితిలో మార్పులు మొదలైతే మే నుంచి రామ్చరణ్ కు సంబంధించిన షూటింగ్ని మొదలుపెట్టాలనుకుంటున్నారట. ఇప్పటికే టీమ్ అంతా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. `ఆచార్య` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి హీరోయిన్ త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో కాజల్ అగర్వాల్ ని కన్ఫమ్ చేసుకున్నారు. కాజల్ కూడా ఏప్రిల్ నుంచి షూటింగ్లో పాల్గొనే అవకాశం వుందని తెలిసింది.