చిరంజీవి, పవన్కల్యాణ్, మహేష్బాబు, వెంకటేష్, నాగార్జున, రవితేజ .. ఇలా ఇండస్ట్రీలో వున్న హీరోలంతా వరుస ప్రాజెక్ట్లతో బిజీగా వుంటే మెగా పవర్స్టార్ రామ్చరణ్ మాత్రం ఇంత వరకు మరో ప్రాజెక్ట్ని అంగీకరించలేదు. `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న రామ్చరణ్ ఆ తరువాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న `ఆచార్య`లో అతిథిగా మెరవనున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ మూవీ తరువాత రామ్ చరణ్ ఏ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. `జర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో కలిసి సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. లేదు వంశీ పైడిపల్లితో సినిమా చేస్తారని, స్టార్ డైరెక్టర్ కొరటాల శివతోనే రామ్చరణ్ తదుపరి చిత్రం వుంటుందని చర్చ జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకులతో కాకుంగా ఓ యంగ్ డైరెక్టర్తో రామ్చరణ్ సినిమా చేయబోతున్నరని వినిపిస్తోంది.
ఆ యంగ్ డైరెక్టర్ మరెవరో కాదు వెంకీ కుడుముల. ఛలో, భీష్మ వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల తాజాగా రామ్చరణ్కు ఓ వండర్ ఫుల్ స్టోరీని నెరేట్ చేశారట. అది ఆయనకు నచ్చేసిందట. వెంటనే వెంకీ కుడుముల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనిలో వెంకీ కుడుముల బిజీగా వున్నారట. ఈ ప్రాజెక్ట్ని అధికారికంగా దసరాకు ప్రకటించే అవకాశం వుందని తెలిసింది.